amp pages | Sakshi

వ్యర్థాలను సముద్రంలో వేయట్లేదు

Published on Wed, 07/20/2022 - 04:02

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా రుషికొండ రిసార్ట్‌ పునరుద్ధరణ ప్రాజెక్టు వ్యర్థాలను సముద్రంలో వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖాలు చేస్తామన్న ప్రభుత్వ వినతికి హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నం.19 పరిధిలోని కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడంపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది.

మూర్తియాదవ్‌ తరఫు న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో పడేసేందుకు కలెక్టర్‌ అనుమతినిచ్చారని, దీనివల్ల సముద్రం కలుషితమయ్యే ప్రమాదముందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి కలెక్టర్‌ ఈ అనుమతులు ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ స్పందిస్తూ.. ఎలాంటి వ్యర్థాలనూ సముద్రంలో పారబోయడంలేదని స్పష్టం చేశారు. తొట్లకొండ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో, నిరుపయోగంగా ఉన్న పార్కు స్థలంలో వేస్తున్నామని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు.

మొత్తం 9.88 ఎకరాల్లో కేవలం 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుగుతాయని, మిగిలిన భూమిలో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడానికి హైకోర్టు అంగీకరించింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్‌ కూల్చివేసిన స్థలంలోనే పనులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ల్యాండ్‌ స్కేపింగ్‌ పేరుతో తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. సుమన్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వ కౌంటర్‌కు ఇచ్చిన సమాధానంలో పిటిషనర్లు ఈ విషయాలను పేర్కొనలేదన్నారు.

ఇప్పుడు వాటిని లేవనెత్తడం సరికాదని స్పష్టంచేశారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఈ కేసులో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల తదుపరి విచారణను హైబ్రీడ్‌ విధానంలో చేపట్టాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. తన వాదన కూడా వినాలంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)