amp pages | Sakshi

యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు

Published on Sun, 12/06/2020 - 20:00

సాక్షి, అమరావతి: టెండర్లు ఖరారయ్యాక మూడు నాలుగు నెలల్లో యుద్ధప్రాతిపదికన గోదాముల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పంటల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తున్న నేపథ్యంలో.. వాటికి సమీపంలో 9 వేల గోదాములు, వాటికి అనుబంధంగా పంటలను ఆరబెట్టే ప్లాట్‌ఫామ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు వీటి నిర్మాణంలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించడంతో శుక్రవారం వ్యవసాయం, మార్కెటింగ్‌, వేర్ హౌసింగ్‌, ఆయిల్‌ఫెడ్‌, సహకార శాఖలకు చెందిన ముఖ్య బాధ్యులు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్న సర్కార్‌ తొలి విడత నాలుగు వేల గోదాములు, ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనుంది. ‍వీటి నిర్మాణాలకు రూ.2,706 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం మార్కెటింగ్‌ శాఖకు మండల, జిల్లా స్థాయిలో 1,055 గోదాములు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 9 లక్షల టన్నులు. వీటిని ఆ శాఖ భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల సంస్థ, ఇతర వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తోంది. 

ఫ్రీ ఫ్యాబ్రికేషన్‌ విధానంలో నిర్మాణాలు
500 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములనే అధికంగా నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న చోట 2 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు కడతారు. పాత విధానంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఫ్రీ ఫ్యాబ్రికేషన్‌ విధానంలో వీటిని నిర్మించనున్నారు. నాలుగు వేల గోదాములను ఐదారు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించనున్నారు. ఫ్రీ ఫ్యాబ్రికేషన్‌ నిర్మాణంలో అనుభవం కలిగిన ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనేలా నిబంధనలు విధించనున్నారు. 

సర్టిఫికెట్‌ ఇస్తేనే నగదు చెల్లింపులు
గోదాముల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ విభాగం.. పనులను పరిశీలించి, సర్టిఫికెట్‌ ఇచ్చాకే నగదు చెల్లింపులు చేస్తారు. పనుల పర్యవేక్షణకు అవసరమైతే గ్రామ సచివాలయాలు, మార్కెటింగ్‌ సిబ్బందిని వినియోగిస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక వీటి పర్యవేక్షణ, వచ్చే ఆదాయం తదితర బాధ్యతలను సహకార శాఖకు అప్పగించే విధానంలో పాటించాల్సిన నిబంధనలపై అధికారులు చర్చించారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు పంపిణీ చేయాల్సిన యంత్ర పరికరాలు, ఇతర బాధ్యతలను ఆగ్రోస్‌కు అప్పగించారు. ఏ ప్రాంతంలో రైతులకు ఎటువంటి యంత్రాలు అవసరమవుతాయి? వాటిని రైతులకు అద్దెకు ఇచ్చే సమయంలో రైతు సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పాటించాల్సిన విధివిధానాలపై చర్చించారు. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను సీఎం ఆమోదానికి పంపనున్నామని మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదనరెడ్డి తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌