amp pages | Sakshi

సొంత జిల్లాలో బాబుకు చుక్కెదురు

Published on Thu, 03/04/2021 - 03:46

సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత జిల్లాలో మరోసారి చుక్కెదురైంది. చిత్తూరు జిల్లాలో ఎన్నికలు ఏవైనా వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని రుజువైంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా చెప్పుకొనే చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ భంగపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. జిల్లాలో మొత్తం 58 డివిజన్లు, 71 వార్డులు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. నగిరి మున్సిపాలిటీలో మాత్రమే టీడీపీకి ఒక వార్డు ఏకగ్రీవమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో క్లీన్‌స్వీప్‌ చేశారు. ఇక్కడ మొత్తం 31 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. పలమనేరు, మదనపల్లె ఎన్నికలు ఏకపక్షంగా నిలవనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ మున్సిపోల్స్‌లో కూడా సత్తా చాటుకుంది. మొత్తం 130 స్థానాలు ఏకగ్రీవమైతే, అందులో 129 వైఎస్సార్‌సీపీవే. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా నిలిచింది. ఇప్పుడు పుంగనూరు మున్సిపాలిటీ కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 

కార్పొరేషన్లలో.. 
చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకుగాను 37 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్‌ పీఠం వైఎస్సార్‌సీపీకి దక్కడం లాంఛనమే. తిరుపతి కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు 22 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 28 డివిజన్లలో కూడా పోటీ ఏకపక్షమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో తిరుపతి మేయర్‌ పీఠం కూడా వైఎస్సార్‌సీపీకే దక్కనుంది. 

పలమనేరు, మదనపల్లెలో హవా
పలమనేరులో 26 వార్డులకుగాను 18 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఈ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి గెలుచుకునేందుకు అవసరమైన బలం ఇప్పటికే లభించింది. మదనపల్లెలో 35 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండుచోట్ల ఎన్నికలు ఏకపక్షమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో 6 వార్డుల్ని వైఎస్సార్‌సీపీ, ఒక వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. పుత్తూరు మున్సిపాలిటీలో 1 వార్డును వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మొత్తంగా పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, తెలుగుదేశం పార్టీ జవసత్వాలు కోల్పోయిందని నిరూపణ అయింది.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)