amp pages | Sakshi

సమగ్ర భూ సర్వేలో వేగం పెంచండి

Published on Wed, 07/20/2022 - 03:57

సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో వేగం పెంచాలని, అక్టోబర్‌ నాటికి కనీసం 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాలని ఉన్నతాధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం అమలు తీరును కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభ్యులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్వేను పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా చేయాలని చెప్పారు.

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వేను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి జిల్లాలోనూ అర్బన్‌ ప్రాంతాల్లో సర్వేను ప్రారంభించేందుకు కనీసం రెండు రోవర్లు, డ్రోన్లు కేటాయిస్తామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలించిందని, అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారని, అందుకోసం చేపట్టాల్సిన చర్యలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేలో అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించకపోతే వివాదాస్పద భూములు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగ సర్టిఫికెట్లతో పెద్దఎత్తున అటవీ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని, ఈ భూముల విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు జాయింట్‌ సర్వే నిర్వహించాలని చెప్పారు.  

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌