amp pages | Sakshi

నిబంధనలకు లోబడే గవర్నర్‌ నిర్ణయం

Published on Sat, 08/01/2020 - 03:10

సాక్షి, అమరావతి: గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలకు అనుగుణంగా, నిపుణులతో చర్చించి, నిబంధనలకు లోబడి మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలపైన ఉన్న గౌరవం కారణంగా గవర్నర్‌ నిర్ణయంపైన బీజేపీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదు. ఇటువంటి ఉత్తమ ప్రమాణాలనే ఇతర పార్టీలు కూడా పాటిస్తాయని బీజేపీ ఆశించింది. కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్‌ను కూడా నిందించడం శోచనీయం. ఇది ఆయన అవకాశవాదానికి పరాకాష్ట’ అని వ్యాఖ్యానించింది. ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వ్యవస్థలకు లోబడి ఉంటాయని, అవి అన్ని వేళలా ఒకేలా ఉంటాయని గుర్తు చేసింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా..
► తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని, కేంద్రానికి, గవర్నర్‌కు ఏ అధికారాలు లేవని చెప్పిన సంగతిని రాష్ట్ర ప్రజలింకా మర్చిపోలేదు. 
► ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సర్వాధికారాలు కేంద్రానికి, గవర్నర్‌కు ఉంటాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.
► టీడీపీ, మరి కొంత మంది స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైఖరిని తప్పుపడుతున్నారు.
► గవర్నర్‌ వ్యవస్థ వారికి అనుకూలంగా పనిచేయాలని, రాజధాని బిల్లులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, లేకుంటే రాజ్యాంగ, విభజన చట్టానికి విరుద్ధమని వక్రభాష్యాలు చెప్పి బీజేపీని టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారు. 
► రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

మా పార్టీ విధానమిదీ..
► అమరావతి రాజధానిగా కొనసాగాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది.
► అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసమన్నది పార్టీ విధానం. 
► హైకోర్టు సీమలో ఉండాలని ప్రథమంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాం.
► అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో వైసీపీ, తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించినట్టు మార్చడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
► రైతులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ చేసింది రాజకీయ తీర్మానం మాత్రమే. దానిని కేంద్ర ప్రభుత్వ విధానంగా చూసే ఆస్కారం లేదు. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే బీజేపీ నాయకులు దీనిపై స్పష్టం చేశారు.
► రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని కేంద్ర హోం శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 11న పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్, ఇతర నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)