amp pages | Sakshi

24న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

Published on Mon, 10/17/2022 - 06:00

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఉదయం ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్‌ 24న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. 

శ్రీవారి దర్శనానికి 10 గంటలు : 
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 31 నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,535 మంది స్వామి వారిని దర్శించుకోగా, 37,357 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.08 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యుల నియామకం 
తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు, ఎస్వీ ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం, వైఖానస ఆగమ స్మార్త పండితులు ఎన్‌.వి.మోహనరంగాచార్యులు, విశ్రాంత వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, తిరుపతి ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, అతిథి ఆచార్యులు, వైఖానస పండితులు వేదాంతం గోపాల కృష్ణమాచార్యులు సభ్యులుగా నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతన ఆగమ సలహా మండలి సభ్యులను శ్రీవిజనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు అభినందించారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)