వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి
Published on Wed, 03/03/2021 - 04:06
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.
#
Tags