amp pages | Sakshi

కఠిన ఆంక్షలు అమలు చేయండి

Published on Thu, 09/09/2021 - 02:45

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే కఠిన ఆంక్షలను అమలు చేయాలంది. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ మెమో దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కోవిడ్‌ విషయంలో పలు అభ్యర్థనలతో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది వై.వి.రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయుల్లో 50 శాతం మందికే వ్యాక్సినేషన్‌ జరిగిందని, అయినా ప్రభుత్వం పాఠశాలలు తెరిచిందని చెప్పారు. మాస్క్‌లు వేసుకోకుండా రోడ్లపై తిరుగుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, వారికి ప్రభుత్వం జరిమానా విధించకపోతుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ ఈ వాదనలను తిప్పికొట్టారు. ఎంతమందికి జరిమానా విధించి ఎంత మొత్తం వసూలు చేసిందీ గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని ధర్మాసనం ప్రస్తావించగా.. పత్రికలు ఏమైనా రాస్తాయంటూ ఇటీవల రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల వివరాలు చెప్పారు.

కోవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటునకు ఎలాంటి అనుమతినివ్వలేదని తెలిపారు. ఈ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన అశోక్‌రామ్‌ జోక్యం చేసుకుంటూ.. ఓనం సందర్భంగా వేడుకల నిర్వహణకు కేరళ ప్రభుత్వం అక్కడి ప్రజలకు అనుమతి ఇచ్చిందని, దీంతో దేశంలోనే ఇప్పుడు అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలిచిందని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు వినాయక ఉత్సవాలకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.  

Videos

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)