amp pages | Sakshi

హైకోర్టు ఆన్‌లైన్‌కు ఏడాది

Published on Mon, 03/22/2021 - 04:26

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా రాష్ట్రంలో న్యాయస్థానాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాక ఏడాది అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 9 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే కేసులను విచారించాలని హైకోర్టు తన పరిధిలో పనిచేసే అన్ని న్యాయస్థానాలకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భౌతిక విచారణలో జరిగినంత వేగంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ సాధ్యం కాకపోవడంతో ఆ ప్రభావం కేసులపై పడుతోంది. దీంతో పెండింగ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. హైకోర్టు న్యాయమూర్తులు, కింది కోర్టుల న్యాయా ధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మొత్తం స్తంభించిపోవడంతో న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీస ఆదాయం లేక పలువురు న్యాయవాదులు ముఖ్యంగా యువ న్యాయవాదులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘లా నేస్తం’ద్వారా కొంతమేర ఆదుకుంది. న్యాయవాదులకు రుణాలు కూడా ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌ విధానం వల్ల పాతతరం న్యాయవాదు లు సాంకేతికతకు అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది. 

పలువురు మృత్యువాత...
హైకోర్టులో కరోనా విజృంభించినప్పుడు పలువురు ఉద్యోగులు, న్యాయవాదులు మృత్యువాతపడ్డారు. అప్పటి సీజే తీరువల్లే కరోనా చెలరేగిందని, అప్పటి ఇన్‌చార్జి రిజిస్ట్రా్టర్‌ రాజశేఖర్, మరికొందరు మృత్యువాత పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

కింది కోర్టుల్లో ఇబ్బందులు...
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు అవసరమైన పూర్తిస్థాయి సాంకేతికత కింది కోర్టుల్లో అందుబా టులో లేకపోవడం కేసుల విచారణకు అవరోధంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వి నిపించేందుకు న్యాయవాదులు మొబైల్‌ ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫోన్లలో సిగ్నల్స్‌ లేక కేసులు తరచూ వాయిదా పడుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్షుల విచారణ, సాక్ష్యాల నమోదు కింది కోర్టులకు సవాలుగా మారింది. కరోనా సెకండ్‌వేవ్‌ భయాందోళనల నేపథ్యంలో హైకోర్టు ఏప్రిల్‌ తరువాత కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

హైకోర్టులో పెండింగ్‌ కేసుల వివరాలు...
► హైకోర్టులో 29.01.2020 నాటికి 70,264 సివిల్‌ కేసులు,  30,485 క్రిమినల్‌ కేసులు, 95,804 రిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1,96,553 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంఖ్య 16.09.2020 నాటికి 2,03,124కు పెరిగింది. వీటిలో సివిల్‌ 1,72,657, క్రిమినల్‌ కేసులు 30467 ఉన్నాయి.
► హైకోర్టులో పెండింగ్‌ కేసుల సంఖ్య 2021 మార్చి 21 నాటికి 2,10,900కు పెరిగింది. వీటిలో సివిల్‌ 1,79,673 కాగా, క్రిమినల్‌ కేసులు 31,227 ఉన్నాయి.
► రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో 6,66,996 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 3,66,718 సివిల్‌ కేసులు కాగా 3,00,278 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.  

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)