amp pages | Sakshi

విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు 

Published on Fri, 11/24/2023 - 05:50

సాక్షి, అమరావతి: విశాఖపట్నం నుంచి పరిపాలనకు కీలక అడుగు పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమతుల అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర జి­ల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు, పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్‌ అధికారులు ఆ జిల్లాల్లో పర్యటించడంతో పాటు విశాఖపట్నంలో రాత్రి పూ­ట బస చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మంత్రులు, సచివాలయాల శాఖలు, సీనియర్‌ అధికారుల­కు కార్యాలయాల వసతిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విశాఖలో మంత్రులు, సచివా­ల­య, వివిధ శాఖాధిపతుల కార్యాలయా­లు, క్యాంపు కార్యాలయాలకు భవనాలను గు­ర్తిం­చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమి­టీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మంత్రులు, సచివా­లయ శాఖల కార్యాలయాల వస­­­­తికి  ప్రభుత్వ భవనాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్ర­భుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, సీనియర్‌ అధికారుల సమీ­క్ష సమావేశాలకు రుషి­కొండలోని మిలీనియం టవ­ర్స్‌ ఎ, బిని క్యాంపు  కా­ర్యా­లయాలుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా­రు. సొంత భవనాల్లేని ప్రధాన శాఖలకు కూడా ఈ టవర్లలో వసతి కేటాయించనున్నట్లు తెలిపారు. 

ఇ­క్కడ 1.75 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా శాఖలకు నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాల్లో మొత్తం 2.27 లక్షల చదరపు అడుగులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మొత్తం 35 శాఖల్లో 16 శాఖలకు మాత్రమే ప్రస్తుతానికి విశాఖలో వసతి కేటాయించారు. వీటికి ఎండాడ, హనుమంతవాక, దయాళ్‌ నగర్, మహారాణి పేట, కంచరపాలెం, దు­ర్గానగర్, రాంనగర్, ఎంవిపీ కాలనీ, పెందుర్తి, మద్ది­ల­పాలెం, సిరిపురం సర్కిల్, భీమునిపట్నం, మర్రి­పా­లెం, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతాల్లో భవనా­లు కేటాయించారు.

మిగతా 19 శాఖలకు భవనాల­ను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఆర్‌టీజీఎస్, సాంఘిక సంక్షేమం, ఆర్థిక, సాధారణ పరిపాలన, గ్రామ, వార్డు సచివాయాలు, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఐటీ, కార్మిక, న్యా­య, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలకు వస­తి గుర్తించాల్సి ఉందన్నారు. ఏ శాఖకైనా విశాఖలో సొంత భవనాలు ఉంటే వాటిలో కార్యాలయా­ల ఏ­ర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

సీని­యర్‌ అధికారుల గృహ వసతి కోసం ముందుగా సొంత భవనాలను వినియోగించుకోవాలని సూ­చించారు. మిలీనియం టవర్లలో వసతి కేటాయింపులపై ఐటీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర్వులకు అనుగుణంగా సచివాలయానికి సంబంధించిన అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Videos

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

కొడాలి నాని మనసున్న రాజు గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

Photos

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)