amp pages | Sakshi

‘బురద జల్లేందుకే ఆ పిచ్చి రాతలు’

Published on Thu, 09/24/2020 - 13:33

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా, సీఎం జగన్ కలయిక వెనుక ఇష్టానుసారంగా ఎల్లోమీడియా రాతలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. పిచ్చిరాతలతో ఎల్లో మీడియా ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు తన హయాంలో ఆలయాలు కూలగొట్టించలేదా?. అప్పుడు ఆయనకు హిందుత్వం గుర్తుకురాలేదా?’’ అని నిలదీశారు. అంతర్వేది రథం ఘటనలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లేందుకే ప్రతిపక్షాలు సమయం కేటాయిస్తున్నాయని మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. (చదవండి: సమీక్షించకపోతే 2జీ స్కాం బయటకు వచ్చేదా?)

రైతులు కష్టాలు పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కన్నబాబు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ.80 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోళ్లను టన్నుకు రూ.11 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే  రైతులకు ఈ ధరల చెల్లింపు చేస్తామన్నారు. ఆయిల్ ఫామ్‌కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించామన్నారు. త్వరలో ఆహారశుద్ధి పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన చేస్తోందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
 

Videos

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌