వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఘనత సీఎం వైఎస్ జగన్దే..
Published on Sun, 12/13/2020 - 14:55
సాక్షి, విజయవాడ: గిరిజనుల కోసం మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను చంద్రబాబు.. ఐదేళ్లు మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు. ‘గిరిజనులకు దేశంలో ఎవరూ చేయని మేలు వైఎస్ జగన్ చేశారు. వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. ప్రత్యేక ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ, 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం.గిరిజనులకు ఏనాడైనా చంద్రబాబు ఇన్ని పథకాలు తెచ్చారా?. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని’’ పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’)
#
Tags