amp pages | Sakshi

పేదల అభివృద్ధిని చూసి బాబు ఓర్వలేకపోతున్నాడు: నారాయణ స్వామి

Published on Tue, 04/19/2022 - 17:14

సాక్షి, తాడేపల్లి: నిరుపేదల కోసం సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పధకాలని నిరుపేదల అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని అన్నారు.

శంకరన్ అనే ఐఎఎస్ కృషితో దేశంలో 20 సూత్రాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్‌లు పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ ఆరోపణలని నారాయణ స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ ఇద్దరు ఐఎఎస్‌లు పేదవాళ్లకి ఆగర్బ శత్రువులగా కనపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలా  ఏటిఎంలా ఉపయోగించుకున్నారో చూశామని తెలిపారు.

చంద్రబాబుకి పొరపాటున ఓటేస్తే ఈ సంక్షేమ‌ పధకాలని ఆపేస్తామని స్పష్టం చేసినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అప్పులు చేసినపుడు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్‌లు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు ప్రజల కోసం ఏ రోజూ తపన పడలేదని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఈ ఇద్దరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా కట్టి చూపించారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో నిర్మాణమైన రోడ్లు వర్షాలకి‌ కొట్టుకుపోవడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో ఈ ఇద్దరు అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయగలరా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పేదల‌కోసం సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేస్తే వృధా ఖర్చా? చంద్రబాబు ఎలా ఖర్చు చేసినా మాట్లాడరా? అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)