amp pages | Sakshi

ఏకగ్రీవాల ప్రకటనపై అభ్యంతరాలు

Published on Thu, 01/28/2021 - 04:20

సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రకటనలున్నాయనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ‘ప్రభుత్వ ప్రకటనలను తప్పుబడుతూ నాలుగైదు రాజకీయ పార్టీలు కొత్త విషయాన్ని ఎన్నికల కమిషన్‌ ముందుకు తెచ్చాయి.  ఎన్నికలు మొదలయ్యాక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు కమిషన్‌ పరిధిలోనే ఉంటాయి. ఈ ప్రకటనపై ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ నుంచి సంజాయిషీ కోరా’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీడియాతో నిమ్మగడ్డ సమావేశం వివరాలివీ.. 

అపరిమితమైతే పరిశీలనే
సాధారణంగా జరిగే ఏకగ్రీవ ఎన్నికలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే నిశితంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసే ఔత్సాహిక అభ్యర్థులకు అండగా నిలబడాలని కలెక్టర్లకు చెప్పా. ఇందుకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తీసుకోవాలని సూచించాం. 

తుది నిర్ణయం తీసుకోలేదు.. 
గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, దాని మూలంగానే ఏకగ్రీవాలు అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇవన్నీ కమిషన్‌ విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఏకగ్రీవాలు జరిగితే క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించాం. ఎన్నికలు సజావుగా జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సుప్రీం తీర్పును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని భావించి, అన్ని విషయాలు న్యాయస్థానాల ముందుంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది.  

సంయమనం పాటించేలా చూడాలని కోరా
ఇవాళ కలెక్టర్ల సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్‌ను వ్యక్తిగతంగా నిందించడం తగదని, ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు సంయమనం పాటించి ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేయాలని గవర్నర్‌ను కోరా. ఈ విషయంపై సీఎస్‌కు గవర్నర్‌ సూచన చేసినట్లు తెలిసింది. మంత్రులందరికీ సీఎస్‌ చెప్పి ఉంటారు. కానీ సాయంత్రానికి ఓ మంత్రి.. ఎవరి ప్రాపకం కోసమో తాను ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నట్లు మాట్లాడడం బాధాకరం. అవి రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకం. ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నది వాస్తవమే. వాళ్లకు హానికరంగా ఉండేటట్లు నేనేమీ చేయలేదే. నేనేమీ వాళ్ల బదిలీ, క్రమశిక్షణ చర్యలు కోరలేదు. సస్పెండ్‌ చేస్తాననలేదు. కేవలం ‘సెన్సూర్‌’ చేశా. వారు మెరుగైన పనితీరు ప్రదర్శించి, పోకడలో మార్పు ఉంటే పునరాలోచించే అవకాశం ఉంటుంది. పొద్దున వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహణను గిరిజా శంకర్‌కే అప్పగించా. జిల్లాలో సమస్యలుంటే ఆయన్నే సంప్రదించాలని కలెక్టర్లకు సూచించా. నేను వారి ప్రతిష్ట, గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నించా. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)