amp pages | Sakshi

చిత్తడి నేలల సమాచారానికి కమిటీ

Published on Thu, 09/29/2022 - 06:50

సాక్షి, అమరావతి: చిత్తడి నేలల గురించి నిర్దిష్టమైన సమాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, అటవీశాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో కూడిన వెట్‌ ల్యాండ్‌ బోర్డ్‌ తొలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండునెలల్లో ఈ కమిటీ ప్రాథమిక నివేదికను వెట్‌ ల్యాండ్‌ బోర్డుకు సమర్పిస్తుందని తెలిపారు.

ప్రజల జీవనోపాధికి విఘాతం లేకుండా అలాగే చిత్తడి నేలల్లో జీవజాలం మనుగడకు ముప్పులేకుండా వెట్‌ ల్యాండ్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని 30 వేల ఎకరాల్లో చిత్తడి నేలలు ఉన్నట్లు గుర్తించిందన్నారు. వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ నేలల్లో కొంతమేర ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు.

కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2వ కాంటూరు వరకు చేపల చెరువులు విస్తరించాయన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సీజనల్‌గా వ్యవసాయం, ఇతర పంటలు సాగుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ అనేక రకాల జంతువులు, పక్షులు, జీవజాలం మనుగడ సాగిస్తున్నాయని చెప్పారు. 

కొల్లేరు, నేలపట్టు, పులికాట్, కోరింగ, శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో చిత్తడి నేలలున్నట్లు తెలిపారు. అరుదైన విదేశీపక్షులు వేల కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చి కొల్లేరు, పులికాట్‌ ప్రాంతాల్లోని చిత్తడి నేలల్లో సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయని చెప్పారు. చిత్తడి నేలల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేసిందని, వాటి ఆధారంగా రాష్ట్రంలోను వెట్‌ ల్యాండ్‌ బోర్డు ఏర్పాటైందని తెలిపారు.

అటవీ అధికారులు చిత్తడి నేలల సంరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్, అటవీదళాల అధిపతి మధుసూదన్‌రెడ్డి, అటవీ శాఖ ఉన్నతాధి
కారులు ఎ.కె.ఝా, శాంతిపాండే తదితరులు పాల్గొన్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)