amp pages | Sakshi

సజావుగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ 

Published on Tue, 07/19/2022 - 02:50

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సజావుగా ముగిసింది. 175 ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కందుకూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న ప్రత్యేక అనుమతితో హైదరాబాద్‌లో ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఓటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అనంతరం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

వైఎస్సార్‌సీపీ బాటలో టీడీపీ  
మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. భారత రాష్ట్రపతిగా తొలిసారి పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అధికారపార్టీ బాటలో నడిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకే 172 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడం పూర్తయినప్పటికీ సాంకేతికంగా ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు రాకపోవడంతో 5 గంటల వరకు సిబ్బంది ఎదురు చూశారు. అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌కు సీల్‌ వేసి అసెంబ్లీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బ్యాలెట్‌ బాక్స్‌ను మంగళవారం ఢిల్లీకి తరలించనున్నారు. గురువారం ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికైన అభ్యర్థి ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  

పటిష్ట బందోబస్తు ఏర్పాటు 
రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, పాస్‌లున్న వ్యక్తులను తప్ప ఎవరినీ లోపలకి అనుమతించలేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియో తీశారు. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్‌ భారతి, ఎన్నికల ప్రత్యేక అధికారి సంతోష్‌ అజ్మీరా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కె.రాజ్‌ కుమార్, సహాయ రిటర్నింగ్‌ అధికారి వనితారాణి నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)