amp pages | Sakshi

Fact Check: ఎక్స్చేంజీల్లో చెప్పిన ధరకే విద్యుత్‌ కొనుగోలు

Published on Thu, 09/07/2023 - 05:23

సాక్షి, అమరావతి: జాతీయ ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్‌ ధరలను ఎవరూ నియంత్రించలేరు. కేవ­లం గరిష్ట సీలింగ్‌ ధరను మాత్రమే నిర్ణయించగ­లరు. ఆ అధికారం కూడా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కే ఉంది. ఇంత చిన్న విషయంపైన కూడా అవగాహన లేకనో లేదా ఉద్దేశ­పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం వైఎస్‌ జగన్‌ పైనా బురద జల్లాలనే అత్యుత్సాహమో ఈనాడు బుధవారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ‘మనం చేస్తే ఖర్చు.. మరొక­రైతే దోపిడీ’ అంటూ అవాస్తవాలను అల్లింది.

ప్రజల అవసరాలకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ సరిపో­నప్పుడు బహిరంగ మార్కెట్‌లో కొనైనా ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే తప్పన్నట్టుగా ఆ కథనంలో అక్కసు వెళ్లగక్కింది. విద్యు­త్‌ను బయట నుంచి మూడు రెట్లు అధిక ధరకు కొంటున్నారని, ఆ భారం ప్రజలపైనే వేస్తారని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఇంధన శాఖ వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. 


► దేశంలో  విద్యుత్‌ ఎక్స్చేంజిలు కొత్తగా ఏమీ రాలేదు. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వివిధ రకాల మార్కెట్‌ సెగ్మెంట్ల  ద్వారా స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు  స్వల్పకాలిక  విద్యుత్‌ అవసరాల కోసం ఎప్పటి నుండో  ఈ ఎక్స్చేంజిలపై ఆధారపడ్డాయి.

► మార్కెట్‌ ధరలు ఆ రోజుకి, ఆ టైం బ్లాక్‌ (ఒక రోజులో  96 టైం బ్లాక్‌ లు ఉంటాయి. ఒక్కోటీ 15 నిమిషాల సమయం)లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్, డిమాండ్‌ బిడ్లు ఆధారంగా ఉంటాయి. 

► ఇందులో బయటి నుంచి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఈ ఎక్స్చేంజిలు కేంద్ర విద్యుత్‌  నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం, మండలి నిబంధనలు, నియమావళికి లోబడి పనిచేస్తాయి.

► నెల వారీగా కొనే ద్వైపాక్షిక  విద్యుత్‌ ఒప్పందాలైతే  డీఈఈపీ, ఈ–బిడ్డింగ్‌ పోర్టల్‌  ద్వారా నిర్దేశిస్తారు. ఈ పోర్టల్‌  కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కేంద్ర విద్యుత్‌ శాఖ ఎక్స్చేంజిల్లో కొనే విద్యుత్‌కు గరిష్ట ధర (సీలింగ్‌ ప్రైస్‌) యూనిట్‌ రూ.10గా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ధారించింది.

► పీక్‌ లోడ్‌ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివిధ కేటగిరీల లోడ్‌ను బట్టి, అందుబాటులో ఉండే ఉత్పత్తి వనరులపై  ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ఈ ధరలను ఎవరూ  నియంత్రించలేరు.

► పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ కొనుగోలు కూడా ఇంధన, విద్యుత్‌ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల  రూపంలో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి ఇచ్చింది. దాని ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు.

► మార్కెట్‌  ధరలు మూడు రెట్లు పెరగలేదు. గతంలో సీలింగ్‌ ధర యూనిట్‌కు రూ. 20 ఉండేది. అప్పుడు కూడా అత్యవసరాన్ని బట్టి డిస్కంలు యూనిట్‌కు రూ. 17 వరకు వెచ్చించి కొన్నాయి.  ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ వల్ల, జల విద్యుత్‌ లేకపోవడం వల్ల మార్కెట్‌లో ధరలు పీక్‌ సమయంలో దాదాపు సీలింగ్‌ ప్రైస్‌ యూనిట్‌ రూ .10, రోజువారీ ధర రూ.6 నుంచి రూ.9 వరకు సీఈఆర్‌సీ నిర్ణయించింది. అంతేగానీ ధరలు మూడు రెట్లు పెరగలేదు. 

► మార్కెట్‌ కొనుగోళ్లలో ఏ విధమైన ప్రమేయాలూ ఉండవు. ధరలు మార్కెట్‌ అంశాల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు.

► దేశంలోనే  అతి పెద్ద విద్యుత్‌ ఎక్స్చేంజి ఐఈఎక్స్‌ గణాంకాల  ప్రకారం.. సంవత్సరం అంతా సాయంత్రం పీక్‌ లోడ్‌ సరాసరి ధరలు (అన్ని నెలలు, సీజన్లు  కలుపుకుని) గత 8 సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్నాయి. 

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు