రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇక్కడి పంచాయతీ ఓటు .. ఎమ్మెల్యేకు రూటు
Published on Wed, 02/10/2021 - 08:12
బొండపల్లి: జిల్లాలోని అన్ని గ్రామాలతో పోల్చితే గజపతినగరం మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపుపొందింది పురిటిపెంట గ్రామం. గజపతినగరం నియోజకవర్గంలోని ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఓటర్ల పరంగా అధికమేకాకుండా ఈ గ్రామంలో ఓటరుగా నమోదైన వారే అధికంగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు.
ఆ విశేషాలను ఓసారి పరిశీలిస్తే...
- ప్రసుత్త శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య పదిహేను సంవత్సరాలకుపైగానే పురిటిపెంటలోని మండలవారి కాలనీలో స్ధిరనివాసం ఏర్పరుచుకొని మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. అయనతోపాటు అయన కటుంబ సభ్యులందరి ఓట్లు కూడా ఈ పంచాయతీలోనే ఉన్నాయి.
- నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పడాల అరుణ కూడా పురిటిపెంటలోని న్యూ కాలనీలో ఎంపీడీఓ కార్యాలయానికి పక్కన స్థిరనివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కును ఇక్కడే వినియోగించుకున్నారు.
- మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు కూడా పురిటిపెంటలోని న్యూకాలనీలోనే నివాసం ఏర్పరుచుకొని ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇలా ఇక్కడ ఓటరుగా నమోదైనవారే ఎమ్మెల్యే పదవులను అలంకరించడం ఓ విశేషంగా చెప్పుకుంటున్నారు.
చదవండి: 82 శాతానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ అభిమానుల విజయ భేరి
#
Tags