amp pages | Sakshi

గోరుముద్దకు మరింత అండ

Published on Thu, 11/03/2022 - 16:31

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బడిలో మధ్యాహ్న భోజనం మానేసిన రోజుల నుంచి ఎప్పుడెప్పుడు భోజనం టైమవుతుందా.. ఈ రోజు కిచిడీ లేదా ఫ్రైడ్‌రైస్‌ తినొచ్చు అంటూ విద్యార్థులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు తీసుకున్న నాటి విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. కేవలం అమ్మ ఒడి, నాడు – నేడు వంటి పథకాలు మాత్రమే విద్యార్థులకు కడుపు నింపవని గుర్తించిన ముఖ్యమంత్రి విద్యార్థులు ఇష్టంగా భోజనం చేసేలా ఏర్పాటు చేయాలని భావించారు. గత ప్రభుత్వాలు కేవలం పప్పు, సాంబారులతో సరిపెట్టారు. చిన్నారుల ఆకలిబాధను గుర్తించిన జగన్‌ మామ వారందరికీ శుభవార్త చెప్పారు. దాని ఫలితమే కిచిడీ, ఫ్రైడ్‌ రైస్, పులిహోర వంటి వాటితో పాటు కోడిగడ్లు, చిక్కీలు మెనూలో చేరాయి. దీనితో గతంలో బడిలో మధ్యాహ్న భోజనం మానివేసిన విద్యార్థులు సైతం ఇప్పుడు ఇష్టంగా తింటున్నారు.  

పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల పెంపు 
విద్యార్థులకు రుచి, శుచికరమైన ఆహారం అందించడానికి నాణ్యమైన నిత్యావసరాలు, బియ్యం వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన వస్తువులు కొనాలంటే కుక్, హెల్పర్‌లకు ప్రస్తుతం ఇస్తున్న నిర్వహణ నిధులు సరిపోవడం లేదని ముఖ్యమంత్రి గ్రహించారు. కుక్, హెల్పర్లు మనస్ఫూర్తిగా పని చేయాలంటే వారికి తగిన ఆదాయం కల్పించాల్సి ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి వారికి నిర్వహణ నిధులు పెంచుతూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, కోడిగుడ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా నిధులు పెంచారు.  

అదనంగా నెలకు రూ.76.93 లక్షలు చెల్లింపు 
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే కుక్, హెల్పర్‌లు దాదాపు 6 వేల మంది వరకూ ఉన్నారు. ఏలూరు జిల్లాలో 1824 పాఠశాలలు ఉండగా 1,50,654 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1413 పాఠశాలలు ఉండగా 1,09,153 మంది విద్యార్థులకు వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం కుక్, హెల్పర్లకు గతంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 4.97 చెల్లించేది.

ప్రస్తుతం ఆ ధరను రూ.5.88కి పెంచింది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 91 పైసలు పెంచింది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రూ.7.45 చెల్లించేది. ప్రస్తుతం ఆ ధరను రూ. 8.57కు పెంచడంతో ఒక్కొక్క విద్యార్థిపై కుక్, హెల్పర్‌లకు రూ.1.12 లబ్ది చేకూరుతోంది. ఈ మేరకు ఏలూరు జిల్లాలోని అందరు విద్యార్థులపై రోజుకు రూ. 1,48,857 అదనంగా లభిస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రూ. 1,07,599 లభిస్తోంది. అంటే నెలకు రూ. 76.93 లక్షలను ప్రభుత్వం కుక్, హెల్పర్లకు అదనంగా చెల్లిస్తోంది. 

మధ్యాహ్న భోజనం మెనూ ఇలా.. 
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఏ పదార్థాలు వడ్డించాలో ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు సోమవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పుచారు, చిక్కీ, మంగళవారం పులిహోర, టమోట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, బుధవారం వెజిటబుల్‌ రైస్‌(ఫ్రైడ్‌రైస్‌), ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ, గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనివారం అన్నం, సాంబారు, తీపి పొంగలి వడ్డిస్తున్నారు. 

సంతోషంగా ఉన్నారు 
ప్రభుత్వం కుక్, హెల్పర్లకు నిర్వహణ నిధులను పెంచడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన పదార్థాలను, రుచి, శుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ప్రతి పాఠశాలలో మా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు మధ్యాహ్న భోజనం జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటుండడంతో వారికి ఆర్థికంగా ఉపయోగకరంగా ఉంటోంది. 
-ఆర్‌ఎస్‌ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు జిల్లా

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)