amp pages | Sakshi

Fertilizers: రైతన్నకు ఊరట.. బస్తాపై 300- 700 తగ్గింపు!

Published on Wed, 06/02/2021 - 04:32

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఇదో శుభవార్త. అంతర్జాతీయంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా కంపెనీలు భారీగా పెంచిన ఎరువుల ధరలు మళ్లీ దిగి వచ్చాయి. రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచడంతో రైతులకు ఊరట లభించింది. తగ్గిన ధరలు మే 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. డీలర్లంతా తగ్గించిన ధరలకే ఎరువుల్ని విక్రయించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫాస్పరస్, అమ్మోనియా, పొటాష్, నైట్రోజన్‌ ధరలు 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో డీఏపీ, కొన్నిరకాల మిశ్రమ (కాంప్లెక్స్‌) ఎరువుల ధరలను కంపెనీలు దాదాపు రెట్టింపు చేశాయి. గతేడాది రబీ సీజన్‌ ముగిసే నాటికి రూ.1,200 ఉన్న డీఏపీ బస్తా ధరను ఏప్రిల్‌ నెలలో రూ.2,400కు పెంచాయి.

డీఏపీతో పాటు కొన్నిరకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కూడా రూ.100 నుంచి రూ.500 వరకు పెంచాయి. ఖరీఫ్‌లో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఆధారంగా రాష్ట్రంలోని రైతులపై రూ.2,500 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి ధరలు పెంచితే ఎలా అంటూ రైతు సంఘాలు గగ్గోలు పెట్టాయి. సబ్సిడీని పెంచి రైతుపై భారం పడకుండా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తి మేరకు డీఏపీపై ఇచ్చే రూ.500 సబ్సిడీని రూ.1200కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు నెలలపాటు ఎగబాకిన ధరలు మళ్లీ దిగి వచ్చాయి.

రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌–2020లో 18.39 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 21.70 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం 20.20 లక్షల టన్నులను రాష్ట్రానికి కేటాయించింది. 6.66 లక్షల టన్నుల పాత ఎరువులతో పాటు ఇటీవల 2.58 లక్షల టన్నులను కలిపి 9.24 లక్షల టన్నుల ఎరువులను జిల్లాలకు కేటాయించారు. గడచిన నెల రోజుల్లో 1.33 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 7.91 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూరియా 3.14 లక్షల టన్నులు, డీఏపీ 46 వేల టన్నుల, ఎంవోపీ 64 వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 72 వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువు 3.01 లక్షల టన్నుల మేర నిల్వలున్నాయి.

తగ్గిన ధరలకే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు
కేంద్రం సబ్సిడీ పెంచడంతో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు బస్తాకు రూ.700 వరకు తగ్గాయి. ఈ ధరలు గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. డీలర్లు ఎవరైనా గతంలో పెంచిన ధరలకు ఎరువుల్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
 – హెచ్‌.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)