amp pages | Sakshi

తూర్పు వైపు స్వాముల చూపు

Published on Fri, 11/26/2021 - 16:33

మండపేట: తిరుపతి, చెన్నైలో భారీ వర్షాలు శబరి యాత్రపై ప్రభావాన్ని చూపుతున్నాయి. పలుచోట్ల ట్రాక్‌ దెబ్బతిని నెల్లూరు, చెన్నై మీదుగా కేరళ వెళ్లే రైళ్లు రద్దవ్వడంతో ఇరుముడులు సమర్పించేందుకు రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటకకు చెందిన అయ్యప్ప మాలధారులు జిల్లాకు తరలివస్తున్నారు. ఆంధ్రా శబరిమలైలుగా ప్రసిద్ది చెందిన ద్వారపూడి, శంఖవరంలోని అయ్యప్ప స్వామి ఆలయాలు స్వాములతో కిటకిటలాడుతున్నాయి. 

మండల దీక్షను పూర్తిచేసుకున్న అనంతరం ఇరుముడులు సమర్పించుకునేందుకు అధికశాతం మంది శబరిమలైకి వెళుతుంటారు. ముందుగానే రైలు టిక్కెట్లు కూడా రిజర్వేషన్లు చేయించుకుంటారు.  కొద్ది రోజులుగా తిరుపతి, చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  శబరిమలై వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు ద్వారా సన్నిధానానికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఎక్కువ మంది స్వాములు మన జిల్లాకు తరలివస్తున్నారు.  

వసతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు 
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి రోజు వందలాదిగా తరలివస్తున్న స్వాములతో ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్ప ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ఆన్నప్రసాదంతో పాటు ఉండేందుకు వసతి సదుపాయాలు ఉండటంతో మాలధారులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ద్వారపూడి ఆలయంలో రోజు దాదాపు 3000 మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా శబరిమలై వెళ్లలేని స్వాములు జిల్లాకు వచ్చి ఇరుముడులు సమర్పించుకుంటుంటారు. ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివస్తున్న స్వాములతో సందడి నెలకొంది. శబరిమలై వెళ్లలేకపోయినా జిల్లాలోని ఆలయాల దర్శనంతో మంచి అనుభూతి కలుగుతోందని స్వాములు అంటున్నారు. భక్తిశ్రద్దలతో స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకుని, నేయ్యాభిషేకం, మాళిగాపురత్తమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. మాలవిసర్జన అనంతరం తమ స్వస్థలాలకు తిరుగుపయనం అవుతున్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి.

శబరిమలై వెళ్లలేక 
శబరిమలై వెళ్లేందుకు రెండు నెలల క్రితమే ట్రై న్‌కు టిక్కెట్లు రిజర్వేషన్‌ చేయించుకున్నాం. భారీ వర్షాలతో రైళ్లు రద్దు కావడంతో ఆంధ్రాశబరిమళైగా పేరొందిన ద్వారపూడి వచ్చాం. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. 
పి. కృష్ణాంజనేయులు, గండుబోయినపల్లి, చిత్తూరు జిల్లా

ఆలయాలు చాలా బాగున్నాయి 
ద్వారపూడి, శంఖవరంలలోని అయ్యప్పస్వామివారి ఆలయాలు చాలా బాగున్నాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీలు మంచి ఏర్పాట్లు చేశారు. ఇక్కడే స్వామివారికి ఇరుముడిలు సమర్పించుకున్నాం. 
టి. సత్యనారాయణ, గుండుగొలను, పశ్చిమగోదావరిజిల్లా 

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)