వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిన శేష వాహనంపై మలయప్ప
Published on Sun, 09/20/2020 - 09:32
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం మలయప్ప స్వామి ఐదు శిరస్సుల చిన శేషవాహనంపై భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శేషునికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పెద శేష వాహనంపై తొలిరోజు రాత్రి ఆది శేషుడు పెద శేషవాహనంలో ఉభయ దేవేరులతో దర్శనం ఇచ్చిన స్వామి, చిన శేష వాహనంపై మలయప్ప స్వామి ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు.
ఐదు శిరస్సుల చిన శేషుడుని వాసుకి భావిస్తారు. కోవిడ్ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. చిన శేషవాహనంపై మలయప్ప స్వామిని తనివితీరా దర్శించుకున్న భక్తులకు కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక రాత్రికి స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు.
#
Tags