amp pages | Sakshi

ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం

Published on Fri, 04/02/2021 - 13:24

సాక్షి, విజయవాడ: రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని శుక్రవారం సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్‌ఈసీ తీసుకున్నారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార నిబంధనలపై పార్టీలకు సూచనలిచ్చారు. సమావేశానికి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలీ, సీపీఎం నేత వైవీరావు హాజరయ్యారు. సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాలేదు.

ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదు: ఎస్‌ఈసీ
సమావేశం అనంతరం ఎస్‌ఈసీ నీలం సాహ్ని మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణపై నిన్న నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. నేడు నిర్వహించిన సమావేశంలో పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరిందని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న పోలింగ్‌, 9న రిజర్వ్‌డే, 10న కౌంటింగ్‌ నిర్వహిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించారు.

నిన్నటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మధ్యలో ఉందని.. గతంలోనే అభ్యర్థుల జాబితా పూర్తైందని పేర్కొన్నారు. ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించలేదన్నారు. కోర్టుల నుంచి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయకూడదని ఎక్కడా అభ్యంతరాలు లేవని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఎస్‌ఈసీ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని పార్టీలను కోరామని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే వ్యాక్సినేషన్‌పై ప్రభావం పడుతుందని ఎస్‌ఈసీ నీలం సాహ్ని తెలిపారు.

బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది: లేళ్ల అప్పిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తామని ఎస్‌ఈసీకి చెప్పామని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షానికి కావాల్సిన వ్యక్తి పదవిలో లేనప్పుడు సమావేశానికి హాజరుకారా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశాన్ని బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు ఎన్నికలు ముఖ్యం కాదు.. ప్రజలే ముఖ్యమని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

ఎన్నికల నిర్వహణపై గిరిజాశంకర్‌ సమీక్ష
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ సమీక్ష నిర్వహించారు. అన్ని జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, జిల్లా ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై మార్గదర్శకాలను వివరించారు.


చదవండి:
ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్‌ఈసీ నీలం సాహ్ని
పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)