amp pages | Sakshi

రోజుకి 9 గంటలపైనే పని 

Published on Wed, 03/02/2022 - 05:28

సాక్షి, అమరావతి: పని ప్రదేశాల్లో 64% మంది ఉద్యోగులు రోజుకు 9 గంటలకు పైగా ఒకే భంగిమలో కూర్చుంటూ పనిభారాన్ని మోస్తున్నారని గోద్రెజ్‌ ఇంటీరియో వర్క్‌ప్లేస్‌ సర్వే తెలిపింది. పని ప్రదేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై గోద్రెజ్‌ ఇంటీరియో వర్క్‌ప్లేస్, ఎర్గోనామిక్స్‌ రీసెర్చ్‌ సెల్‌ ‘ఇట్స్‌ టైమ్‌ టు స్విచ్‌’ పేరుతో తాజాగా ఓ అధ్యయనం చేసింది. గంటల కొద్దీ ఒకే భంగిమలో పనిచేస్తుండటంతో అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు గుర్తించింది. వర్క్‌ డెస్క్‌లు, సమావేశాల్లో ఎక్కువ గంటలు కూర్చోవడం లేదా నిల్చుని ఉండటంతో కండరాలపై తీవ్ర ప్రభావం పడి త్వరగా అలసిపోతున్నారని పేర్కొంది.

నిరంతరం ఒకే భంగిమలో కాకుండా కాసేపు కూర్చోవడం, కొద్ది సేపు నిల్చోవడంతో శరీరంపై ఒత్తిడి తగ్గుతుందని సూచించింది. ఈ విధానం ద్వారా బాగా పనిచేస్తూ..శరీరాన్ని రోజంతా చురుగ్గా ఉంచుకోవచ్చని తెలిపింది. పనిలో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను పరిష్కరించడానికి ఉద్యోగులు అనుసరించిన పద్ధతులను తెలుసుకోవడానికిగాను దేశవ్యాప్తంగా 500 మంది నుంచి వివరాలను సంస్థ తీసుకుంది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం నుంచి ఉపశమనానికి ఏం చేయాలని ప్రశ్నించగా..73% మంది తమకు తెలియదని సమాధానమిచ్చారు.

మరో 27% మంది ప్రత్యామ్నాయంగా నిల్చోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎక్కువసేపు నిల్చుని పనిచేయడం కూడా ప్రమాదమేనని సర్వే హెచ్చరించింది. ఈ అవరోధాలను అధిగమించేందుకు కార్యాలయాల్లో సాంకేతిక సామర్థ్యంతో పాటు ఉత్పాదకతను పెంచడానికి సహాయపడే సరైన మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొంది. కరోనా మహమ్మారితో పనిచేసే విధానంలో సాంకేతికత జోడింపుతో చాలా మార్పులు వచ్చాయని, అయితే అధిక శాతం మంది ఉద్యోగులు పాత విధానంలోనే సీటుకు అతుక్కుపోయి పనిచేస్తున్నారని వివరించింది. ముఖ్యంగా కార్యాలయాల్లో కూర్చునే పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడింది.   

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)