amp pages | Sakshi

ప్రభుత్వ కార్యనిర్వాహక హక్కులను హైకోర్టు లాక్కుంది

Published on Sun, 11/22/2020 - 03:03

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో అతిథి గృహం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను ఏపీ హైకోర్టు పూర్తిగా లాగేసుకుందని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఒక అతిథి గృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయించే నిర్ణయాధికారం తనకే ఉన్నట్లు హైకోర్టు భావిస్తోందని.. ఇది సబబు కాదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తాజాగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అతిథి గృహం అంశాన్ని నిర్ణయించే పరిధి హైకోర్టుకు లేదంది. రాజ్యాంగం ప్రకారం.. సమాన అధికారం, హక్కులు కలిగిన మిగిలిన వ్యవస్థలను గౌరవించాలని.. ఆ వ్యవస్థల అధికారాలను తన అధికారాలుగా భావించకూడదంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చేసిన హెచ్చరికలను హైకోర్టు పూర్తిగా విస్మరించిందని తెలిపింది. 

రాజ్యాంగ సమానత్వాన్ని హైకోర్టు కాలరాసినట్లు కాదా?
న్యాయమూర్తులు తమ పరిధులను తెలుసుకోవాలని.. చక్రవర్తుల్లా భావించరాదని, ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయరాదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ కార్యనిర్వాహక హక్కులను హైకోర్టు లాక్కోవడం ఆమోదయోగ్యమా? అని ప్రశ్నించింది. హైకోర్టు  ఉత్తర్వులు ఆరావళి గోల్ఫ్‌ కోర్స్‌ వర్సెస్‌ చంద్రహాస్‌ అండ్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పినదానికి విరుద్ధం కాదా? రాజ్యాంగం నిర్దేశించిన సమాన వ్యవస్థల మధ్య ఉండాల్సిన రాజ్యాంగ సమానత్వాన్ని హైకోర్టు కాలరాసినట్లు కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంది.

రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, బలం మీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉందన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని ఆక్షేపించింది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. విశాఖలో ప్రభుత్వం అతిథి గృహం నిర్మిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నిర్మాణాలు తప్ప, మిగిలిన నిర్మాణాలను కొనసాగించవచ్చునని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)