amp pages | Sakshi

ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటం శుభసూచకం

Published on Wed, 04/14/2021 - 03:57

పెందుర్తి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ జాతకాలు బాగుండటం వల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు ప్లవనామ సంవత్సరంలో మేలు జరుగుతుందని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాబోయే రోజుల్లో నిరంతరాయంగా సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో ఉగాదిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానం నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేసూ్త.. సేనాధిపతి కుజుడు కావడంతో ఈ ఏడాది దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పారు. చాలా పెద్ద నాయకుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ఆర్థికంగా తెలుగు రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని.. ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వివరించారు. నేతల మధ్య ఏర్పడే సమన్వయ లోపం కారణంగా విభేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదన్నారు. దేశానికి ఇది మంచిది కాదన్నారు. దేశంలో కుట్ర పూరిత యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు. కుటుంబాల మధ్య కూడా అనిశ్చితి ఏర్పడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శ్రీప్లవనామ సంవత్సరంలో చతుగ్రహ కూటమి తరచూ ఏర్పడుతుందని దీనివలన కాలసర్ప దోషాలు సంభవిస్తాయని.. ఈ పరిణామాల వలన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా కొన్ని విపత్కర పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత భయంకరంగా ఉంటుందని, వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని చెప్పారు.

మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి జూలై వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని..ఆ తర్వాత ఎంతవరకు ప్రబలుతుందో ఆ తర్వాత గానీ నిర్ణయించలేమని స్పష్టం చేశారు. ప్రజలు తిరుమల శ్రీవారిని, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్నస్వామి, బెజవాడ కనకదుర్గమ్మను, యాదాద్రి నరసింహస్వామిని, వేములవాడ రాజరాజేశ్వరస్వామిని, బాసర సరస్వతీదేవిని కొలవాలని సూచించారు. స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ ప్లవ అంటే వెలుగునిచ్చేదని అని అర్థాన్ని వివరించారు. వికారి, శార్వరి నామ సంవత్సరాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించి ప్లవ నామ నూతన సంవత్సరం వెలుగులివ్వాలని కోరుతూ అంతా రాజశ్యామల అమ్మవారిని ప్రార్థించాలని అన్నారు.

గంటల పంచాంగం ఆవిష్కరణ
పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పఠనంతో ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. స్వామీజీల చేతుల మీదుగా శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. స్వర్ణ కవచధారిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు విశేష అర్చనలు అందుకున్నారు. పీఠాధిపతి, ఉత్తరాధికారి చేతుల మీదుగా గంటల పంచాంగం ఆవిష్కరణ జరిగింది. పీఠం ఆస్థాన సిద్ధాంతి పంతుల రామలింగ స్వామి పంచాంగ శ్రవణం వినిపించారు. భక్తులకు స్వామీజీ చేతుల మీదుగా ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)