amp pages | Sakshi

ప్రధానితో సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు..

Published on Sat, 05/21/2022 - 08:06

సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31న రాష్ట్రం నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర  కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో (సీఎస్‌లతో) వీడియో సమావేశం నిర్వహించారు.
చదవండి: చంద్రబాబు పొంతనలేని వ్యాఖ్యలు.. అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు

సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ మాట్లాడుతూ విజయనగరం, కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి ముగ్గురు లబ్ధిదారులను ప్రధానితో సమావేశానికి ఎంపిక చేస్తామని చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం ఉజ్వల యోజన, పోషణ్‌ అభియాన్, పీఎం మాతృ వందన తదితర అన్ని పథకాలపై లబ్ధిదారులతో ప్రధాని నేరుగా మాట్లాడతారని రాజీవ్‌ గౌబ చెప్పారు.

అన్ని పథకాలు లబ్ధిదారులకు చేరడం, పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చడంపై సూచనలు, సలహాలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు, ప్రతి పథకానికి కనీసం 10 మంది లబ్ధిదారులు, జిల్లా ప్రముఖులు, బ్యాంకులు, పౌర సంఘాల ప్రతినిధులు సహా కనీసం 500 మందిని భాగస్వాములను చేయాలని సూచించారు. జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని, పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)