వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
సీఎం జగన్ను కలిసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన
Published on Wed, 09/21/2022 - 16:33
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని సీఎం కార్యాలయంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కలిశారు. మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని భూమన కరుణాకర్రెడ్డి ఐదువేల కాపీలను ముద్రించారు. వీటిని సీఎం జగన్ బుధవారం ఆవిష్కరించారు.
ఈ కాపీలను విజయనగరంలోని గురజాడ ఇంటికి బహూకరించి.. సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు భూమన తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: (కరవు, బాబు ఇద్దరూ కవలలు: సీఎం జగన్)
Tags