వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొనసాగుతున్న ద్రోణి
Published on Tue, 04/27/2021 - 03:48
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ద్రోణి, ఉపరితల ఆవర్తనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. బిహార్ తూర్పు ప్రాంతాల నుంచి జార్ఖండ్, ఒడిశా, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి వ్యాపించి ఉందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పరిసరాల మీద ఉపరితల ఆవర్తనం ఉందని, వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రతోపాటు రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని పేర్కొంది.
#
Tags