అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బురదచల్లడం మానుకోండి: రామోజీపై వలంటీర్ల ఆగ్రహం
Published on Sat, 12/17/2022 - 05:58
శంఖవరం/గుర్రంకొండ: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న తమపై బురదచల్లడం మానుకోవాలని ఈనాడు పత్రిక, రామోజీరావుపై పలువురు వలంటీర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలంటీర్లపై ‘ఈనాడు’లో వచ్చిన అసత్య కథనాన్ని ఖండిస్తూ శుక్రవారం కాకినాడ జిల్లా శంఖవరం, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ఈనాడు దినపత్రిక ప్రతులు, రామోజీరావు దిష్టిబొమ్మలను వలంటీర్లు దహనం చేశారు. వలంటీర్లు మాట్లాడుతూ ‘ఈనాడులో ప్రచురించినట్లుగా మేం వేగులం కాదు... ప్రజాసేవకులం. అవినీతికి తావులేకుండా అద్భుతంగా పనిచేస్తున్న వలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో అపోహలు సృష్టించడానికి రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేయడం దారుణం. ఇప్పటికైనా వాస్తవాలను ప్రచురించాలి’ అని అన్నారు.
#
Tags