amp pages | Sakshi

YSR Bus Yatra: శ్రీకాకుళం నుంచి ఏపీ మంత్రుల బస్సుయాత్ర

Published on Thu, 05/26/2022 - 10:29

సాక్షి, శ్రీకాకుళం: పలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు జరిగిన సామాజిక న్యాయాన్ని వివరించడానికి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  గురువారం ఉదయంం ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ.. ‘‘దేశానికి ఇండిపెండెన్స్‌ రాక ముందు నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పాలనలో భాగస్వామ్యం కోసం పోరాటాలు చేశాయి. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారు. ఇది చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్ ఒక్కరే చేయగలిగారు. ఇలా చేయమని సీఎం జగన్‌కు ఎవరూ అడగలేదు.. ఆయనే స్వతహాగా అవకాశం కల్పించారు. 

ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. వాళ్ళకి పంచి పెడితే దానిని కొందరు హేళన చూస్తున్నారు. విమర్శలు చేసే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానించినట్టే. గతంలో నాయకులకు సలాం కొడితే పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరికీ తల వంచాల్సిన పనిలేదు. సీఎం జగన్ వాళ్ళ ఇంటికే పథకాలు అందిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర మంతా తిరిగాడు. కానీ, మేము ఇచ్చిన పథకాల్లో తప్పు జరిగిందని చెప్పగలిగాడా?. ఏ బీసీ అయినా తల వంచే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. 

ఈ వర్గాల వారిని సీఎం జగన్‌ సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేశారు. దానికి సజీవ సాక్ష్యంగా నిలబడాలి అనే బస్సు యాత్ర చేస్తున్నాం. మూడేళ్ళలో ఈ వర్గాల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం.. అవన్నీ ప్రజలకు చెప్తాము. ఈరోజు దేశానికే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని పంపారు’’ అని తెలిపారు.

అనంతరం, పశుసంవర్ధక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘసంస్కర్త సీఎం జగన్. ఆ వర్గాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశమంతా చూస్తోంది. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నాము’’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బస్సు యాత్రను అడ్డుకుంటామనడం సిగ్గుచేటు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌