amp pages | Sakshi

అదానీ హవా: 3 వేల కోట్ల భారీ డీల్‌

Published on Fri, 08/05/2022 - 10:01

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌ తాజాగా మెక్వారీ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌కి (ఎంఏఐఎఫ్‌) ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లోని టోల్‌ రహదారుల పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.  ఈ డీల్‌ విలువ రూ. 3,110 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ఈ రహదారులు పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నాయని వివరించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ అదానీ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఏఆర్‌టీఎల్‌) ద్వారా ఈ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపింది.

‘గుజరాత్‌ రోడ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ (జీఆర్‌ఐసీఎల్‌), స్వర్ణ టోల్‌వే (ఎస్‌టీపీఎల్‌)ను కొనుగోలు చేసేందుకు ఏఆర్‌టీఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది‘ అని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. ఎంఏఐఎఫ్‌కు జీఆర్‌ఐసీఎల్‌లో 56.8 శాతం, ఎస్‌టీపీఎల్‌లో 100 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాలను ఏఆర్‌టీఎల్‌ పూర్తిగా కొనుగోలు చేస్తోంది. అలాగే జీఆర్‌ఐసీఎల్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కి ఉన్న మిగతా వాటాలను కూడా దక్కించుకునే అంశాన్ని కూడా పరిశీలించనుంది. 2022 సెప్టెంబర్‌లో ఈ లావాదేవీ పూర్తి కాగలదని అదానీ  తెలిపింది. 

ఏపీ, గుజరాత్‌లో రెండు రహదారులు.. 
ఎస్‌టీపీఎల్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు టోల్‌ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి నేషనల్‌ హైవే 16పై తడ నుంచి నెల్లూరు (110 కి.మీ.) వరకూ, మరొకటి నేషనల్‌ హైవే 65పై నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం- విజయవాడ వరకూ(48 కి.మీ.) ఉంది. అటు జీఆర్‌ఐసీఎల్‌కు కూడా గుజరాత్‌లో రెండు టోల్‌ రోడ్‌లు ఉన్నాయి. ఒకటి అహ్మదాబాద్‌ నుంచి మెహ్‌సానా వరకూ(51.6 కి.మీ.), రెండోది వదోదర నుంచి హలోల్‌ వరకూ(31.7 కి.మీ.) ఉన్నాయి.


మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్‌ రంగ దిగ్గజం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 469 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 266 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,579 కోట్ల నుంచి 3 రెట్లుపైగా ఎగసి రూ. 41,066 కోట్లకు చేరింది.
 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌