amp pages | Sakshi

బిగ్‌ రిలీఫ్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్‌!

Published on Wed, 04/13/2022 - 15:09

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్‌ ప్రకటించింది.ఇల్లు నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుతో హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉద్యోగులకు అందుబాటులోకి తెస్తూ..కేంద్రం ఏప్రిల్‌ 1న మార్గదర్శకాలను విడుదల చేసింది. 

కేంద్ర ప్రభుత్వం హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌(హెచ్‌బీఏ) రుణ వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీ రేట్లకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్‌బీఏను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను మినిస్టీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ఏప్రిల్1న విడుదల చేసిన మెమోరాండంలో పేర్కొంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్‌1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటాయి. దీంతో ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022-2023లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండనుంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 

7వ వేతన సంఘం 
7వ వేతన సంఘం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ 2017 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 34 నెలల ప్రాథమిక వేతనం లేదా రూ. 25 లక్షలు లేదా ఇంటి ఖర్చు లేదా దాని ప్రకారం మొత్తం అడ్వాన్స్ తీసుకోవచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యం, ​​కొత్త నిర్మాణం లేదా కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం తీసుకున్న బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇంటి నిర్మాణ అడ్వాన్స్‌ను పొందవచ్చు.

 

ఉద్యోగులకు బిగ్‌ రిలీఫ్‌ 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హౌస్‌ బిల్డింగ్‌ అడ్వాన్స్‌(హెచ్‌బీఏ) వడ్డీ రేట‍్లు మార్చి 2022 వరకు 7.9శాతంగా ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్‌బీఏలను ఫైనాన్షియల్‌ ఇయర్‌లో 80బీపీఎస్‌లను తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగించినట్లైంది.

చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)