amp pages | Sakshi

వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం

Published on Thu, 07/08/2021 - 00:28

సాక్షి, ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా లీగల్‌ అడ్వైజర్‌ (న్యాయæ సలహాదారు), ట్రాన్సాక్షన్స్‌ అడ్వైజర్‌ (వ్యవహారాలు సలహాదారు)ల కోసం ప్రభుత్వం బుధవారం బిడ్లు ఆహ్వానించింది. ఈ ఏడాది జనవరి 27న కేంద్ర కేబినెట్‌ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం నిర్ణయం తెలిసిన నాటి నుంచి స్టీల్‌ప్లాంట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాస్తారోకోలు, బంద్‌లు, సమ్మెలు నిర్వహించారు. అప్పటి నుంచి కూర్మన్నపాలెం కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు చేసే ఉద్యమాలకు రాష్ట్రంలోని అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి సహకారం అందిస్తూ కార్మిక సంఘాలకు మద్దతు ఇస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు సార్లు కేంద్రానికి లేఖలు రాయడం జరిగింది.

గత నెలలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో స్వయంగా కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో జరిపిన చర్చల్లో కూడా స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని కోరడం జరిగింది. అయినా కేంద్రం తన దూకుడును కొనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా గత నెల 22న న్యూఢిల్లీలో జరిగిన దీపమ్‌ సమావేశంలో లీగల్‌ అడ్వైజర్, ట్రాన్సాక్షన్‌ అడ్వైజర్‌లను నియమించాలని నిర్ణయించారు. బిడ్లకు సంబంధించిన దరఖాస్తులను బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రీ బిడ్‌ మీటింగ్‌ ఈనెల 15న ఏర్పాటు చేశారు. ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. టెక్నికల్‌ బిడ్‌ను ఈనెల 29న తెరవనున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.    

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌