రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
ఈపీఎఫ్ అలెర్ట్: ఈ-నామినేషన్ దాఖలు చేశారా? చేస్తే మీకే లక్షల్లో ప్రయోజనం!
Published on Fri, 03/25/2022 - 08:51
ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బంపరాఫర్ ఇచ్చింది. ఈ నామినీ ప్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల ఖాతాదారులు ఈ- నామినీని పూర్తి చేయాలని సూచించింది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్లైన్ సేవలు, ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు.
Benefits of filing e-Nomination.
— EPFO (@socialepfo) March 22, 2022
ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD
"ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?"
సభ్యుడు మరణించిన తర్వాత ఆన్లైన్ లో క్లయిమ్ చేసుకోవచ్చు.
పేపర్లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్.
పీఎఫ్, పెన్షన్ ఆన్లైన్ చెల్లింపు.
అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా.
Tags