amp pages | Sakshi

అమ్మకాల్లో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ సంస్థలు..!

Published on Fri, 08/13/2021 - 16:37

కోవిడ్‌-19 రాకతో పలు వ్యాపార సంస్థలు పూర్తిగా కుదేలయ్యాయి. కోవిడ్‌-19 రాకతో ఫాస్ట్‌ మూవింగ్‌ కస్యూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎమ్‌సీజీ) కంపెనీలు, ఈ-కామర్స్‌ సంస్థలు గణనీయంగా వృద్ధి చెందాయి. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లను విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుస లాక్‌డౌన్‌లు పలు ఆన్‌లైన్‌ కిరాణా సంస్థలకు భారీ ప్రయోజనాన్నిచేకూర్చాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎక్కువగా ఈ-కామర్స్‌ సంస్థలపై మొగ్గుచూపాయి. 

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ-కామర్స్‌ సంస్థలు ద్వారా కిరాణా అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని​ మార్కెట్‌ పరిశోధన సంస్థ నిల్సన్‌ఐక్యూ పేర్కొంది.కోవిడ్‌ రాక ముందు 2020 సంవత్సరంలో ఈ-కామర్స్‌ అమ్మకాలు 96 శాతంగా ఉండగా  కోవిడ్‌ రాకతో 134 శాతానికి గణనీయంగా అమ్మకాలు వృద్ధి చెందాయి. దీంతో మే నెలలో  ఈ-కామర్స్‌ సంస్థలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్‌ 52 మెట్రో నగరాల్లో ఎఫ్‌ఎంసిజి అమ్మకాలు ఈ-కామర్స్‌ సహకారంతో 2021 మే నెలలో రెండంకెల మార్కును వృద్ధిని నమోదు చేశాయి.

ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల వృద్ధి కొనసాగుతూనే ఉందని నీల్సన్‌ఐక్యూ కస్టమర్‌ సక్సెస్‌ లీడ్‌ సమీర్‌ శుక్లా వెల్లడించారు. వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయడంలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలకు ఈ-కామర్స్‌ కంపెనీలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ-కామర్స్‌ సంస్థల సహయంతో ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల సేల్స్‌లో మారికో లిమిటెడ్‌  9 శాతం, హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ 6 శాతంగా వృద్ధి చెందాయి. కాగా మరోవైపు గ్రాసరీ స్టోర్ల పరిస్థితి దయానీయంగా మారింది. ప్రజలు ఎక్కువగా గ్రాసరీ స్టోర్లవైపు కాకుండా ఈ-కామర్స్‌ సంస్థల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని నిల్సన్‌ఐక్యూ పేర్కొంది. 


 

Videos

విశాఖనుంచే ప్రమాణస్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?