నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏడు రోజుల్లో ఆరోసారి తగ్గిన బంగారం
Published on Thu, 08/27/2020 - 18:01
ముంబై : బంగారం, వెండి ధరల క్షీణత కొనసాగుతోంది. గత వారం రోజుల్లో ఆరు రోజుల పాటు బంగారం ధరలు పతనాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్లో గురువారం పదిగ్రాముల బంగారం 435 రూపాయలు తగ్గి 51,344కు దిగివచ్చింది. ఇక 884 రూపాయలు తగ్గిన కిలో వెండి 66,645 రూపాయలకు పడిపోయింది. ఈక్విటీ మార్కెట్లు లాభపడటంతో మదుపుదారుల నుంచి బంగారానికి డిమాండ్ పలుచబడిందని ట్రేడర్లు, బులియన్ నిపుణులు అంచనా వేశారు. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వెలువడేవరకూ బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ధరలు మరింత తగ్గితే కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉందని కొటాక్ సెక్యూరిటీస్ విశ్లేషించింది.
#
Tags