అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట
Published on Tue, 06/01/2021 - 14:08
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చేలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్కు రిజర్వ్ బ్యాంక్ సూచనలు జారీ చేసింది. ఈ తరహా కరెన్సీ లావాదేవీలు జరిపే కస్టమర్లకు సర్వీసులు అందించరాదంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్పై వివరణనిచ్చింది. ఈ సర్క్యులర్ను 2020లో సుప్రీంకోర్టు తోసి పుచ్చినందున అప్పట్నుంచి ఇది అమల్లో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో వర్చువల్ కరెన్సీ లావాదేవీలు నిర్వహించే వారికి సర్వీసులను అందించకుండా ఉండటానికి ఈ సర్క్యులర్ను అడ్డుగా చూపరాదని స్పష్టం చేసింది. అయితే, కస్టమర్ల ఖాతాల వివరాల వెల్లడి (కేవైసీ), యాంటీ మనీ లాండరింగ్ తదితర చట్టాల నిబంధనలను పాటించాలని బ్యాంకులు మొదలైన వాటికి ఆర్బీఐ సూచించింది.
చదవండి: విమానయానం, ఆక్సిజన్ ప్లాంట్లకూ రుణ హామీ..
Tags