వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బలమైన వృద్ధి బాటలో పయనిస్తున్న మైనింగ్
Published on Thu, 06/08/2023 - 08:09
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్స్ పరిశ్రమ ఈ ఏడాది కూడా బలమైన వృద్ధి బాటలో పయనిస్తుందని, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల దిశగా పురోగతి సాధిస్తుందని (నెట్ జీరో/ఈఎస్జీ అనుకూల) కేపీఎంజీ ఇంటర్నేషనల్ ‘2023 గ్లోబల్ మైనింగ్ అండ్ మెటల్స్ అవుట్లుక్’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మెటల్స్ రంగం టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నట్టు కేపీఎంజీ ఇంటర్నేషన్ మెటల్స్ హెడ్ ఉగో ప్లటానియా పేర్కొన్నారు.
- పరిశ్రమకు చెందిన ప్రతి ఐదుగురు ఎగ్జిక్యూటివ్లలో నలుగురు ఉత్పాదకత వృద్ధి, సుస్థిర లక్ష్యాల విషయంలో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఒకరు మాత్రం నిరాశావహంగా ఉన్నారు.
- అల్యూమినియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, లిథియం, మాంగనీస్, నికెల్ ఉత్పత్తిదారుల్లో సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకునే విషయంలో అంతరం కనిపించింది. వేగంగా ఈ మార్గాన్ని చేరుకుంటామని 64 శాతం మందే చెప్పారు.
- తమ కంపెనీ ఇప్పుడే ఈ దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టినట్టు 34 శాతం మంది చెప్పారు.
- కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం ఖర్చుతో కూడుకున్నది కాకుండా లాభాలకు మార్గమని మెజారిటీ ఎగ్జిక్యూటివ్లు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్తు పట్ల ఆశావహంగా ఉన్నారు.
- మైనింగ్లో వేగంగా పురోగతి సాధిస్తున్న కంపెనీలు ఇప్పటికే కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా చర్యలు అమలు చేస్తున్నాయి. ఈ దిశగా వస్తున్న సానుకూల ఫలితాలు వాటితో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహాన్నిస్తున్నాయి.
- ముఖ్యంగా కంపెనీ సీఈవోలు,బోర్డు డైరెక్టర్లు ఈఎస్జీ లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉన్నారు.
#
Tags