amp pages | Sakshi

Nifty: కొనుగోళ్లు కొనసాగాయ్‌..!

Published on Fri, 05/07/2021 - 06:03

ముంబై: వ్యాక్సినేషన్‌ వేగవంతంపై ఆశలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో రెండోరోజూ కొనుగోళ్లు కొనసాగాయి. మెటల్, ఆటో, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో గురువారం సెన్సెక్స్‌ 272 పాయింట్లు పెరిగి 48,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 107 పాయింట్లు ఎగసి 14,725 వద్ద నిలిచింది. కోవిడ్‌ టీకా తయారీ వేగవంతం కోసం వర్తక సంబంధిత మేధో హక్కుల నిబంధనలను రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం మద్దతు తెలిపింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌ లాంటి వర్ధమాన దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందనే ఆశలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరతీశారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి.

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 13 పైసలు బలపడటం కలిసొచ్చింది. మార్చి క్వార్టర్‌ ఫలితాలు అంచనాలకు మించి నమోదు అవుతుండటంతో మెటల్‌ షేర్లు మెరిశాయి. ఐటీ, ఆటో రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. అయితే ఫార్మా, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 334 పాయింట్లు ర్యాలీ చేసి 49వేల పైకి 49,011 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 126 పాయింట్లు లాభపడి 14,744 వద్దకు చేరుకుంది. నాలుగు రోజుల వరుస విక్రయాల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తొలిసారి నికర కొనుగోలుదారులుగా మారి రూ.1,223 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.633 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

‘కేసుల పెరుగుదలతో నిరాశలో కూరుకుపోయిన మార్కెట్‌ వర్గాలకు వ్యాక్సినేషన్‌ వేగవంతానికి యూఎస్‌ తీసుకున్న చర్యలు ఊరటనిచ్చాయి. అయితే ఐదురోజుల పతనం తర్వాత వ్యాధి సంక్రమణ రేటు పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది.  ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించవచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో్ల నిఫ్టీ 14,800 –14,900 స్థాయి పరిధిలో కీలకమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’

ఐపీవోకు నిర్మా గ్రూప్‌ కంపెనీ రెడీ
న్యువోకో విస్టాస్‌ ప్రాస్పెక్టస్‌ దాఖలు
సిమెంట్‌ రంగ కంపెనీ న్యువోకో విస్టాస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా కర్సన్‌భాయ్‌ పటేల్‌కు చెందిన నిర్మా గ్రూప్‌.. సిమెంట్‌ కంపెనీ రూ. 5,000 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్‌ నియోగీ ఎంటర్‌ప్రైజెస్‌ మరో రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని అమ్మకానికి ఉంచనుంది. పబ్లిక్‌ ఇష్యూ నిధులలో రూ. 1,500 కోట్లను నిర్ణీత రుణాల చెల్లింపులతోపాటు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో న్యువోకో విస్టాస్‌ పేర్కొంది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)