amp pages | Sakshi

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ సిబ్బంది 

Published on Tue, 01/26/2021 - 10:59

సాక్షి, రంగారెడ్డి: ఏసీబీ అధికారులు సర్వేయర్‌తోపాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ను వలపన్ని పట్టుకున్నారు. భూ సర్వే రిపోర్టు కోసం సర్వేయర్‌ డబ్బులు డిమాండ్‌ చేశారు. రూ. 3 వేలు తీసుకుంటుండగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. అనంతరం సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన దోమ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఐనాపూర్‌కు సయ్యద్‌ ఖాజా యాదుల్లా హుస్సేని తాను కొనుగోలు చేసిన సర్వేనంబర్‌ 445లో ఉన్న 3 ఎకరాల భూమిని సర్వే చేయాలని 2018లో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి సర్వేయర్‌ భాగ్యవతిని అడుగగా.. మళ్లీ దరఖాస్తు చేసుకొని రావాలని సూచించారు. దీంతో బాధితుడు 2019లో మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యాలయానికి పలుమార్లు తిరుగగా గత ఏడాది డిసెంబర్‌ 7న సర్వేకోసం ఇరుగుపొరుగు రైతులకు నోటీసులు ఇవ్వాలని ఆయనకు అందజేసింది. దీంతో యాదుల్లా హుస్సేని కావలికార్‌ సాయంతో చుట్టుపక్కల రైతులకు నోటీసులు ఇచ్చాడు.  



రూ. 10 వేలు డిమాండ్‌ 
డిసెంబర్‌ 15న సర్వే చేసిన సర్వేయర్‌ భాగ్యవతి రూ.10 వేల లంచం అడిగారు. బాధితుడు తాను అంత ఇచ్చుకోలేనని చెప్పి రూ. 2,000 ఇచ్చాడు. అనంతరం సర్వే రిపోర్టు ఇచ్చేందుకు సర్వేయర్‌ భాగ్యవతి.. యాదుల్లా హుస్సేన్‌ను సతాయించింది. చివరకు రూ. 3 వేలు ఇస్తానని అతడు అంగీకరించాడు. దీంతో బాధితుడు ఈనెల 18న యాదుల్లా హుస్సేని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు శనివారం పథకం ప్రకారం దాడులు చేసేందుకు సిద్ధమవగా ఆమె విధులకు హాజరు కాలేదు. దీంతో సోమవారం బాధితుడు కార్యాలయానికి వచ్చి సర్వేయర్‌కు ఫోన్‌ చేశాడు. తాను ఫీల్డ్‌లో ఉన్నానని.. రావడానికి సమయం పడుతుందని, తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌కు డబ్బులు ఇవ్వమని భాగ్యవతి సూచించారు. దీంతో బాధితుడు కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రేమ్‌కుమార్‌కు రూ. 3 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్‌ భాగ్యవతిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.  

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)