amp pages | Sakshi

రైనా బంధువులపై దాడి కేసు: ముఠా అరెస్ట్‌

Published on Wed, 09/16/2020 - 15:59

న్యూఢిల్లీ : ప్రముఖ క్రికెటర్‌ సురేష్‌ రైనా మేనత్త కుటుంబంపై దాడి కేసు మిస్టరీ వీడింది. పంజాబ్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠా ఈ ఘోరానికి పాల్పడినట్లు సిట్‌ అధికారులు తేల్చారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆగస్టు 19వ తేదీన పఠాన్‌కోట్‌, తర్యల్‌లోని రైనా మేనత్త కుటుంబంపై ఈ ముఠా దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్‌ కుమార్‌(రైనా మామ) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. ఆయన కుమారుడు కౌశల్‌ కుమార్‌ ఆగస్టు 31న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రైనా మేనత్త ఆశా రాణి పరిస్థితి ప్రస్తుతం సీరియస్‌గా ఉంది. దాడిలో గాయపడ్డ మరి కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి స్పెషల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)కు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ దాదాపు 100మంది అనుమానితుల్ని విచారించింది. ( సురేష్‌ రైనా కుటుంబంలో తీవ్ర విషాదం )

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 15న అధికారులకు ఓ ముఖ్య సమాచారం అందింది. దాడి జరిగిన నాటి మరుసటి రోజు ఉదయం ఓ ముగ్గురు వ్యక్తుల్ని అక్కడి ఓ రోడ్డులో చూశామని, ఆ ముగ్గురు పఠాన్‌ కోట్‌లోని రైల్వే స్టేషన్‌ దగ్గర ఉంటున్నారని వారికి తెలియవచ్చింది. దీంతో వెంటనే ఆ అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. విచారణలో వారే ఈ నేరం చేసినట్లు రుజువైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ( మా అంకుల్‌ను చంపేశారు: రైనా )

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?