ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వృద్ధురాల్ని చంపిన ఏనుగు
Published on Sun, 07/11/2021 - 07:49
కేజీఎఫ్(కర్ణాటక): బంగారుపేట తాలూకా బూదికోట ఫిర్కా గుల్లహళ్లి గ్రామంలో ఏనుగు దాడిలో మహిళ మృతి చెందింది. గుల్లహళ్లి గ్రామానికి చెందిన సిద్దమ్మ (59) శనివారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో గుల్లహళ్లి గ్రామం నుంచి పక్కలోనే ఉన్న గొడగుమందె గ్రామానికి తన మనవడిని చూడడానికి కాలినడకన బయల్దేరింది. మార్గమధ్యంలో అడవి ఏనుగు.. సిద్దమ్మపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ఎమ్మెల్యే ఎస్ఎన్ నారాయణస్వామి సిద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించి అంత్య సంస్కారం కోసం కొంత సహాయ ధనం అందించారు. కాగా, గత కొద్ది నెలల కాలంగా బూదికోట ఫిర్కాలో మనుషులపై, పంటలపై ఏనుగుల దాడులు పెరిగాయి. ప్రజలు భయం నీడన జీవించాల్సి వస్తోంది. ఇంతవరకు తాలూకాలో ఏనుగుల దాడిలో 9 మంది మరణించారు.
#
Tags