amp pages | Sakshi

పెళ్లైన 4 నెలలకే.. మరొకరితో సఖ్యతగా మెలుగుతూ పరువు తీసిందని..

Published on Tue, 05/17/2022 - 11:30

 సాక్షి, నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం పెట్టుకొని తన పరువు తీసిందనే కోపంతో భార్యను ఉరేసి హత్య చేసిన భర్తను నల్లగొండ టూటౌన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లాలోని శౌకత్‌పల్లి గ్రామానికి చెందిన మాడవత్‌ శంకర్‌ మునుగోడు మండలం కొరటికల్‌ సమీపంలో రోడ్డు పనిలో కూలీగా చేస్తున్నాడు. శంకర్, మెదక్‌ జిల్లా ఎస్‌ కొండాపురం గ్రామానికి చెందిన రాతుల సరిత అలియాస్‌ శిరీష(21) ఏడేళ్లుగా ప్రేమించుకొని ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెండు నెలలపాటు మంచిగానే కలిసి ఉన్నారు.

ఉగాది పండుగకు ఏప్రిల్‌ 1న తల్లిగారింటికి వెళ్లిన సరిత అదే గ్రామానికి చెందిన గుగులోతు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉండడంతో అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మెదక్‌ జిల్లాలోని శంకరంపేట పోలీస్‌ స్టేషన్‌లో సరిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏప్రిల్‌ 18న సరిత, సురేష్‌ను పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇరువర్గాల పెద్ద మనుషుల సమాక్షంలో కౌన్సెలింగ్‌ చేశారు. అయినప్పటికీ శిరీష సురేష్‌తోనే వెళ్లిపోయింది.

కొన్నిరోజుల తర్వాత సరిత తన ప్రియుడు సురేష్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి ‘నీతో పాటు వస్తాను నన్ను తీసుకెళ్లు’ అని చెప్పింది. ఆ తర్వాత తన తల్లిగారింటికి చేరకున్న సరిత ఈ నెల 10న మరోసారి తండ్రి పూలసింగ్‌ ఫోన్‌ నుంచి భర్త శంకర్‌కు కాల్‌ చేసి తనను తీసుకెళ్లమని కోరడంతో సరే అన్నాడు. పూలసింగ్‌ తన పెద్ద అల్లుడు ముడావత్‌ బాబుకు విషయం చెప్పగా..  అతడు హైదరాబాద్‌లో శంకర్‌కు సరిత అప్పగించి వెళ్లిపోయాడు. 
సంబంధిత వార్త: వివాహమైన మూడు నెలలకే భార్యపై అనుమానం.. లాడ్జీకి పిలిపించి.. 

పరువు తీసిందనే కోపంతో..
తనను మోసం చేసి మరొకరితో లేచిపోయి తన పరువు తీసిందని మనసులో పెట్టుకున్న మాడవత్‌ శంకర్‌ ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించాడు. ఈ నెల 13న తనతో పాటు సరితను నల్లగొండకు తీసుకొచ్చిన శంకర్‌ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జిలో దిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రగిలిపోతున్న శంకర్‌ భార్య సరిత మెడకు చున్నీతో చుట్టి అదే గదిలో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. సరిత చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాతనే శంకర్‌ లాడ్జి నుంచి బస్టాండ్‌కు వచ్చి తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శంకర్‌ సోమవారం నల్లగొండకు వచ్చి మునుగోడు బస్సు ఎక్కేందుకు ఎదురు చూస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)