amp pages | Sakshi

వివాహేతర సంబంధం.... ప్రియుడితో కలిసి సొంత మామను..

Published on Mon, 09/13/2021 - 11:32

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలిచాడని ప్రియుడితో కలిసి సొంత మామను కడతేర్చింది ఓ కోడలు. అందుకు సంబంధించిన ఆదివారం బాధిత కుటుంబ బంధువులతోపాటూ ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన శ్యామల ముత్తయ్య(60)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముత్తయ్య వృత్తిరీత్యా బాతుల పెంపకం నిర్వహిస్తుంటాడు.

అందులో భాగంగా బాతులను మేపేందుకని శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్‌ గ్రామానికి వారం కిందట కుమారుడు నర్సింహ, కోడలు శైలజతో కలిసి వచ్చాడు. ఈ క్రమంలో మాధారంకలాన్‌ గ్రామ సమీపంలోని చెరువుకట్ట కిందిభాగంలో తాత్కాలిక గుడిసె వేసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ పట్టణంలో నివాసం ఉంటున్న ముత్తయ్య పెద్దకుమార్తె ఇంటివద్ద ఆదివారం మనుమరాలుకు నూతన పట్టువస్త్రాలంకరణ ఉండడంతో ముత్త య్య కొడుకు నర్సింహ శనివారం కరీంనగర్‌ వెళ్లిపోయాడు. 

వేరొకరితో సఖ్యతగా ఉంటూ..
కోడలు శైలజ తన అన్నకు వరుసకు బావమరిది అయిన నేరేడుచర్లకు చెందిన బాతుల పెంపకందారుడైన మహేశ్‌తో కొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది. ప్రస్తుతం కేతేపల్లి మండలం కాసనగోడులో బాతులను మేపుతున్న మహేశ్‌ శైలజ భర్త కరీంనగర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని శనివారం రాత్రి మాధారంకలాన్‌లోని శైలజ ఉంటున్న గుడిసె వద్దకు వచ్చాడు. అదేసమయంలో బీడీల కోసమని మాధారంకలాన్‌కు వెళ్లి వచ్చేసరికి శైలజ, మహేశ్‌లు ఒంటరిగా గుడిసెలో ఉన్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ముత్తయ్య కోడలు శైలజ, ఆమె ప్రియుడు మహేశ్‌లను తిడుతూ ఈ విషయాన్ని ఆదివారం ఉదయం ప్రజలకు చెబుతానని హెచ్చరించాడు. 

తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి..
దీంతో విషయం ఎలాగైనా బయటపడుతుందని గమనించిన కోడలు శైలజ, ప్రియుడు మహేశ్‌తో కలిసి ముత్తయ్యపై దాడికి దిగారు. ఈ క్రమంలో కిందపడిపోయిన ముత్తయ్య ముఖంపై తలదిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ముత్తయ్య మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాతా అక్కడి నుంచి మహేశ్‌ పరారీ అయ్యాడు. కోడలు శైలజ తన పిల్లలతో కలిసి మామ మృతదేహాన్ని గుడిసెలోనే ఉంచి నిద్రించింది. ఆదివారం తెల్లవారుఝామున కరీంనగర్‌లో ఉన్న తన భర్త నర్సింహకు ఫోన్‌చేసి మామ ముత్తయ్య గుండెపోటుతో మృతిచెందాడని తెలిపింది.

దీంతో ఆదివారం సాయంత్రానికి మాధారంకలాన్‌కు చేరుకున్న నర్సింహ తండ్రి శరీరం, ముఖంపై ఉన్న గాయాలతో భార్యపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమందించాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా.. హత్యకు పాల్పడిన కోడలు శైలజ పోలీసుల అదుపులో ఉంది. పరారీలో ఉన్న మహేశ్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

చదవండి: Missing Cases: ఒంటరిగా అదృశ్యం.. జంటగా ప్రత్యక్షం

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)