amp pages | Sakshi

ఘరానా మోసం: మరణించినట్లుగా నమ్మించి..

Published on Mon, 02/01/2021 - 08:15

తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా)‌: సబ్సిడీ రుణాలిప్పిస్తానంటూ వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో దళితుల నుంచి రూ.4 కోట్ల వరకు దండుకుని బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాడి ఉదంతమిది. తాము మోసపోయామని తెలుసుకున్న దళితులు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన తూర్పు గోదావరి జిల్లా మాదిగ ఐక్య వేదిక చైర్మన్‌ మడికి కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన జగతపు జాషువా అనే వ్యక్తి తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. (చదవండి: అంబేడ్కర్‌ విగ్రహానికి అవమానం

కేంద్ర ప్రభుత్వం గేదెల కొనుగోలు నిమిత్తం సబ్సిడీ రుణాలు ఇస్తోందని.. ముందుగా రూ.లక్ష చెల్లిస్తే వారి అకౌంట్‌లో రూ.1.60 లక్షలు జమ అవుతాయని నమ్మబలికాడు. రుణాలు పొందగోరే వారు ముందుగా రూ.లక్ష చొప్పున చెల్లించి సొసైటీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన అనేక మంది దళితులు అతడి వలలో చిక్కి మోసపోయారు. 15 రోజుల నుంచి తాడేపల్లిలోని వర్ధన్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయంలో ఎవరూ కనిపించడం లేదని కిశోర్‌బాబు తెలిపారు. దీంతో జగతపు జాషువా గురించి ఆరా తీయగా.. అతడిపైన, అతడి కుటుంబ సభ్యులపైన మూడు రాష్ట్రాల్లో 21 కేసులు నమోదైనట్టు తెలిసిందన్నారు. అతడు ఓసారి నకిలీ పీటీ వారెంట్‌తో జైలు నుంచి తప్పించుకున్నాడని.. అంతేకాకుండా అతను చనిపోయినట్టుగా సమాజాన్ని నమ్మించి.. కొత్త ముసుగు వేసుకొని ప్రజలను మోసగిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.(చదవండి: అది టీడీపీ నేతల కుట్రే)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌