నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్సై ఇంట్లో బంగారం చోరీ
Published on Wed, 02/03/2021 - 11:26
పాలకొల్లు సెంట్రల్: ఆచంట ఎస్సై రాజశేఖర్ ఇంట్లో 19 కాసులు బంగారం చోరీకి గురైంది. పాలకొల్లు సీఐ సీహెచ్ ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం ఆచంట ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ పాలకొల్లు లజపతిరాయ్ పేట శివారు ప్రాంతంలో ఉంటున్నారు. సోమవారం రాత్రి విధినిర్వహణలో భాగంగా రాజశేఖర్ ఆచంటలో డ్యూటీకి వెళ్లారు. ఇంటి ప్రధాన ద్వారానికి కిటికి బోల్ట్ ఊడి ఉంది. ఆ కిటికీలో నుంచి చెయ్యి పెట్టి డోర్ లాక్ తీసుకుని దొంగ గదిలోకి చొరబడ్డాడు. ఎస్సై భార్య, పిల్లలు ఒక గదిలో పడుకుని ఉండగా.. పక్కగదిలో ఉన్న బీరువా తాళాలు అక్కడే ఉండడంతో బీరువా తెరిచి బంగారం చోరీ చేశాడు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటన స్థలంలో పరిశీలన చేశారు. సీఐ ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags