amp pages | Sakshi

ఏం కష్టం వచ్చిందో.. ముగ్గురు చిన్నారులు సహా కుటుంబం ఆత్మహత్య

Published on Sat, 10/28/2023 - 19:31

సూరత్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో ఓ కుటుంబమంతా ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబంలోని ఏడుగురు విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలకు విషమిచ్చిన ఓ వ్యాపారి ఉరేసుకొని తాను కూడా ప్రాణాలు వదిలాడు. కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా అలజడి నెలకొంది. ఈ ఘోర ఘటన సూరత్‌లో శుక్రవారం అర్ధరాత్రి వెలుగుచూసింది.

వివరాలు..  సూరత్‌లోని పాలన్ పూర్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి మనీష్‌ తన పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో సహా కుటుంబంలోని ఏడుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం మనీష్‌ సహోద్యోగి కాల్‌ చేయగా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇంటికి చేరుకున్నాడు.

ఇంటి తలుపులు కూడా తీయకపోవడంతో అనుమానం వచ్చి వెనక డోర్‌ వద్దనున్న కిటీకిని ధ్వంసం చేసి ఇంట్లోగా వెళ్లగా ఈ దారుణం గురించి తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతులను మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), ముగ్గురు పిల్లలు, మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
చదవండి: పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. యువతి హత్య

Videos

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

Photos

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)