రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
భార్యపై అనుమానం..చివరకు ఎంతపని చేశాడంటే..
Published on Sun, 03/20/2022 - 07:47
కంబదూరు (అనంతపురం జిల్లా): అనుమానం పెనుభూతమై.. చివరకు ఇల్లాలిని బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని నాగలాపురానికి చెందిన బోయ వెంకటేశులు పదేళ్ల క్రితం భార్య వెంకటలక్ష్మమ్మ (40), పిల్లలు సౌమ్య, మంజునాథ్తో కలిసి కంబదూరుకు వలసవచ్చాడు. అద్దె ఇంటిలో ఉంటూ కూలి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. భార్యపై అనుమానాలు పెంచుకుని రోజూ మద్యం మత్తులో గొడవపడేవాడు.
చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..
శనివారం ఉదయం భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. మధ్యాహ్నం ఇంటిలో నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మపై రోకలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడి అనంతరం వెంకటేశులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags