అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి ఆత్మహత్య
Published on Thu, 07/07/2022 - 15:18
తిరువొత్తియూరు: పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈరోడ్ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది. వివరాలు.. అంబాపేట సమీపం కల్బావి తొట్టిపాళ్యెంకు చెందిన అప్పుస్వామి (45), సుమతి దంపతులకు సంజయ్ (15), చంద్రు ఇద్దరు కుమారులు ఉన్నారు. మైలంపాడి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సంజయ్ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిలయ్యాడు.
అప్పుస్వామి కుమారుడిని మందలించి ట్యూషన్కు పంపించాడు. అయితే సంజయ్ దాన్ని పట్టించుకోకపోవడంతో అప్పుస్వామి ఆందోళనకు గురయ్యాడు. పురుగుల మందు తాగి స్పృహ తప్పాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని ఈరోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడు. దీనిపై అంబాపేట పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.
#
Tags